తలసేమియా వ్యాధి.. రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరం

by Shyam |

<p>దిశ, మెదక్ : తల సేమియా వ్యాధి గ్రస్తులకు సిద్ధిపేట రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం రూరల్ తహశీల్దారు కార్యాలయ సిబ్బంది, ఆర్ఐ బాలయ్య, భాగ్యలక్ష్మీ, వీఆర్వో, వీఆర్ఏ కుటుంబ సభ్యులతో కలిసి 28 మంది రక్త శిబిరం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలోని తన నివాసంలో రక్త దానం చేసిన దాతలను అభినందన పత్రాలు అందజేసి అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో [&hellip;]</p>

తలసేమియా వ్యాధి.. రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరం
X

దిశ, మెదక్ :
తల సేమియా వ్యాధి గ్రస్తులకు సిద్ధిపేట రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం రూరల్ తహశీల్దారు కార్యాలయ సిబ్బంది, ఆర్ఐ బాలయ్య, భాగ్యలక్ష్మీ, వీఆర్వో, వీఆర్ఏ కుటుంబ సభ్యులతో కలిసి 28 మంది రక్త శిబిరం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలోని తన నివాసంలో రక్త దానం చేసిన దాతలను అభినందన పత్రాలు అందజేసి అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంతటి సేవా భావంతో రెవెన్యూ ఉద్యోగులు ముందుకొచ్చి రక్తదానం చేయడం సంతోషంగా ఉందని మంత్రి కొనియాడారు. రక్తదానం వలన కొంత మంది పేద ప్రజల ప్రాణాలు నిలబెట్టవచ్చన్నారు.కార్యక్రమంలో తహశీల్దారు పరమేశ్వర్, రక్త దానం చేసిన రూరల్ తహశీల్దారు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: lockdown, medak, corona, revenue department, thalassemia patients, minister harish rao

Next Story