పోక్సో నేరాలు, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shyam |   (  Updated:2021-09-16 08:03:32  IST  )

<p>దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాల కేసులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ్‌హట్‌లో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారయత్నంపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు సమాచారం ఇచ్చే మంత్రి కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్‌హట్‌లో ఈరోజు 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడియత్నం జరిగి ఉండేది [&hellip;]</p>

Revanth KTR
X

దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాల కేసులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ్‌హట్‌లో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారయత్నంపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు సమాచారం ఇచ్చే మంత్రి కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్‌హట్‌లో ఈరోజు 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడియత్నం జరిగి ఉండేది కాదు. తెలంగాణలో గత ఏడేళ్లలో చిన్నారులపై (పోక్సో నేరాలు) దాడులు 300శాతం పెరిగాయి.’’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.

Next Story