‘ధర్మపురి గుండు కొట్టించుకుంటే పర్వాలేదు.. కానీ’

by  |
‘ధర్మపురి గుండు కొట్టించుకుంటే పర్వాలేదు.. కానీ’
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష నిర్వహిస్తున్నారు. పసుపు రైతులకు మద్దతుగా చేపట్టిన ఈ దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘ధర్మపురి ఓ అధర్మ ఎంపీ. ధర్మపురి నువ్వు గుండు కొట్టించుకన్నా పర్వాలేదు. ఎంపీ పదవికి రాజీనామా చేయకున్నా పర్వాలేదు. కానీ.. 20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు తేలేదో చెప్పాలి. పార్లమెంట్‌లో రైతుల పక్షాన ఎందుకు కొట్లాడటం లేదు.’’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతుల చస్తున్నా.. పట్టించుకోకుండా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గులేదని విమర్శించారు. మద్దతు ధర ఇస్తున్నందుకే నష్టం వస్తుందనడం సరికాదని తెలిపారు.


Next Story

Most Viewed