- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పోలీస్ శాఖ రెండుగా చీలిపోయిందని, పోలీసులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం డీజీపీ కార్యాలయం స్పందించింది. పోలీసు శాఖపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ కార్యాలయం ఖండించింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు రేవంత్ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారణమైనవని తెలిపింది. ఇవి పోలీస్ వ్యవస్థ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఉన్నతాధికారుల మధ్య విబేధాలు ఏమీ లేవని, పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రకటించింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలు కాపాడటం కోసం పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోందని వెల్లడించింది.
Next Story