ఈ నెల 30న శాయంపేటకు రేవంత్‌రెడ్డి రాక?

by  |
RevanthReddy1
X

దిశ, శాయంపేట: ఈ నెల 30న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక షెడ్యూల్ సైతం ఖరారైనట్ల విశ్వసనీయ సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం రేవంత్ రెడ్డి రాక కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈరోజు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 2వ తేది వరకు సుప్రీంకోర్టు ఎలాంటి సభలు, సమావేశాలకు నిర్వహించవద్దంటూ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాక వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు.



Next Story