ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పిటిషన్

by  |
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పిటిషన్
X

దిశ,వెబ్ డెస్క్: అవినీతి నిరోధక శాఖ కోర్టులో ఓటుకు నోటు కేసుపై మంగళవారం విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి‌తో పాటు సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు అనేది ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఏసీబీ అభియోగాలు అవినీతి నిరోధక శాఖ చట్టం పరిధిలోకి రావని పిటిషన్‌లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణను ఏసీబీ కో్ర్టు బుధవారానికి వాయిదా వేసింది.

Next Story

Most Viewed