సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు

by  |

దిశ, మేడ్చల్: కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని.. చేతల్లో మాత్రం రైతులకు మేలు చేయడం లేదని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. మోసంబి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న కేసీఆర్.. మన దగ్గర పండే పంటలను మనవాళ్లే తినాలని చెప్పారన్నారు. అంతేకాకుండా ఎగుమతులను కూడా నిషేదించాలని ఆదేశాలు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఎగుమతుల నిషేదంతో స్థానికంగా డిమాండ్ ఉన్నా.. ప్రభుత్వ కార్యాచరణ లేకపోవడంతో మోసంబి రైతులు నూటికి రూ.75 నష్టపోతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా సీఎం స్పందించాలని.. మోసంబీ రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: Revanth Reddy, criticizes, CM KCR, formers, medchal

Next Story

Most Viewed