దరిద్రుడు కేసీఆర్.. దళితులను ఓర్వడు: రేవంత్ రెడ్డి

by  |
దరిద్రుడు కేసీఆర్.. దళితులను ఓర్వడు: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఓ దరుద్రుడి ఆ పదవిలో ఉన్నారని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్రవెల్లి వేదికగా దళిత దండోరా కార్యక్రమంలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో దళితుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడని చూసి ఓర్వలేక అవినీతి ముద్రవేసి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కానీ, ఆ దళిత బిడ్డ చేసిన అవినీతి ఏంటో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం బయటపెట్టకపోవడం ఏంటని రేవంత్ రెడ్డి నిలదీశారు. కనీసం మాదిగలకు మంత్రి వర్గంలో చోటులేదని.. మొదటి ఐదేండ్లు మహిళలకు మంత్రి పదవులే కట్టబెట్టలేదని విమర్శించారు కానీ, ఇంద్రవెల్లి వేదికకు అధ్యక్షతను వహించింది ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటూ.. కాంగ్రెస్ ఆమెకు గౌరవమైన హోదాను కల్పించింది అంటూ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed