స్నేహితుడి వద్దకు వెళ్ళిన రిటైర్డ్ ఉద్యోగి మిస్సింగ్

by  |
missing
X

దిశ, కుత్బుల్లాపూర్ : స్నేహితుడి వద్దకని వెళ్లిన విశ్రాంత ఉద్యోగి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీకి చెందిన ఎం.సుబ్రహ్మణ్యం తండ్రి ఎంవీఎస్ సుధాకర్ రావు(60) విశ్రాంత ఉద్యోగి. ఈనెల 15వ తేదీన సాయంత్రం స్నేహితుడి వద్దకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా కలవడం లేదు. చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొడుకు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed