స్పందించిన కేటీఆర్.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా అంటూ పోస్ట్

by  |
Ask KTR
X

దిశ, వెబ్‌డెస్క్ : సైదాబాద్‌లో చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను ఆ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి లైంగిక వేధింపులు, అత్యాచారం వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా. నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేశారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి’’ అని కేటీఆర్‌.. హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా ఈనెల 9న తోటి చిన్నారులతో ఆడుకుంటున్న చిన్నారిని ఓ యువకుడు చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజులు దాటినా అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఎవరు స్పందించడం లేదని ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.


Next Story

Most Viewed