రెసిడెన్షియల్ స్కూల్లో ప్రవేశ పరీక్షలు

by  |
రెసిడెన్షియల్ స్కూల్లో ప్రవేశ పరీక్షలు
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణలోని సోషల్, ట్రైబల్, బీసీ, జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షను నవంబర్ 1న నిర్వహిస్తున్నట్టు సంస్థల కన్వీనర్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పైన తెలిపిన రెసిడెన్షియల్ విద్యా సంస్థలందు 5వ తరగతి ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షను నవంబర్ 1న ఉ. 11 గం.ల నుంచి మ. 1 గం.ల వరకు నిర్వహిస్తామని, కొవిడ్-19 మార్గనిర్దేశకాలను పరిగణలోకి తీసుకుని మాస్కులు, సోషల్ డిస్టెన్స్ వంటివి తప్పక పాటించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ వరకు సంస్థకు చెందిన వెబ్ సైట్‌ల నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. మొత్తం 1,48,168 దరఖాస్తులు అందాయని, 48,240 సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed