వరదల్లో వృద్ధుడు.. రంగంలోకి రెస్క్యూ టీం

by  |
వరదల్లో వృద్ధుడు.. రంగంలోకి రెస్క్యూ టీం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో నివర్‌ తుఫాను బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాలను ముంచెత్తింది. భారీ వరదల కారణంగా ఎంతో మంది సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కొట్రకోన సమీపంలోని నీవా నదిలో 60ఏళ్ల వృద్ధుడు చిక్కుకున్నాడు. దీంతో సమాచారం అందిన వెంటనే అధికారులు ఎన్టీఆర్ జలాశయం గేట్లను మూసివేశారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వృద్ధుడిని రక్షించారు. నదిలో చిక్కుకున్న వృద్ధుడు కలిజవేడు గ్రామానికి చెందిన అబ్బులయ్య గుర్తించారు.

Next Story

Most Viewed