ఆ ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య

by  |
ఆ ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య
X

ముంబయి: భీవండి పట్టణంలో మూడంస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 41కి చేరింది. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలను గురువారం ఉదయం 11:45 గంటల నుంచి నిలిపివేసినట్టు ఎన్డీఆర్‌ఎఫ్ తెలిపింది. కాగా, మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణం పటేల్ కాంపౌండ్ ఏరియాలో గత సోమవారం తెల్లవారు జామున మూడంస్తుల బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో ఇప్పటివరకు శిథిలాల నుంచి 41మంది మృతదేహాలను వెలికితీయగా, 25మంది క్షతగాత్రులను రక్షించినట్టు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెల్లడించింది. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై వేటు పడింది. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి రాష్ట్రపతి రామ్‌నాథ్, ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు.



Next Story

Most Viewed