ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించాలి

by  |
ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించాలి
X

దిశ, న్యూస్​బ్యూరో: ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించాలని నేషనల్​ కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్​ కుమార్​ ఓ ప్రకటనలో కోరారు. కొవిడ్​- 19 ప్రభావం వల్ల ఎంట్రన్స్​ పరీక్షలకు అందరూ ధరఖాస్తులు చేసుకోలేకపోయారని, అదనపు రుసుం లేకుండా దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంట్రన్స్​ పరీక్షలు రాసే విద్యార్థుల వెసులుబాటు కోసం మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed