హుజురాబాద్‌లో మాదిగ అభ్య‌ర్థిని నిల‌బెట్టండి.. మాణికం ఠాగూర్‌కు నేత‌ల విన‌తి

by  |
హుజురాబాద్‌లో మాదిగ అభ్య‌ర్థిని నిల‌బెట్టండి..  మాణికం ఠాగూర్‌కు నేత‌ల విన‌తి
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: హుజురాబాద్ ఉప ఎన్నికలో మాదిగ నేత‌కే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాల‌ని మాణికం ఠాగూర్‌ను ఆ ఆసామాజిక వ‌ర్గం నేత‌లు కోరారు. ఆ సామాజిక‌ వ‌ర్గానికి చెందిన పార్టీ నేత‌లు గురువారం మాణికం ఠాగూర్‌ను గాంధీభ‌వ‌న్‌లో క‌లిశారు. ఠాగూర్‌ను క‌లిసిన వారిలో బ‌క్క జ‌డ్స‌న్‌, కొండేరి మ‌ల్ల‌య్య‌, స‌తీష్‌, విజ‌య్‌, హ‌రిష్‌వ‌ర్ధ‌న్‌, స‌త్య‌నారాయ‌ణ‌, ర‌మేష్ త‌దిత‌రులు ఉన్నారు. రెండు రోజుల క్రితం కూడా పార్టీ అధ్య‌క్షురాలు సోనియ‌గాంధీకి ఫ్యాక్స్‌, మెయిల్ ద్వారా కూడా రిక్వెస్ట్ లెట‌ర్ పంపారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను టార్గెట్‌గా చేసుకుని ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ నేప‌థ్యంలో మాదిగ సామాజిక వ‌ర్గం నేత‌ను అభ్య‌ర్థిగా నిల‌బెడితే గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని ఠాగూర్‌కు తెలిపారు. కొండా సురేఖ‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం దాదాపుగా ఖాయ‌మ‌ని పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. మాదిగ నేత‌ల ప్ర‌య‌త్నాలు ఆస‌క్తి రేపుతున్నాయి. త‌మ విన‌తికి ఠాగూర్ సానుకూలంగా స్పందించార‌ని వారు చెబుతున్నారు.


Next Story