- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగును ప్రవేశపెట్టడం రైతులను అవమానించటమేనని కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం విమర్శించారు. నియంత్రిత సాగు విధానాన్ని విరమించుకోవాలంటూ బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ చైర్మన్ చంద్రం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులను అవమానపరిచే రీతిలో సాగు విధానం ఉందన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటనే సాగుచేయాలని నిర్బంధం విధించటం సిగ్గుచేటన్నారు. గతంలో రైతులు వారికి ఇష్టమైన పంట సాగుచేసి దిగుబడులు సాధించేవారన్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతది.. ఏ పంట సాగుచేస్తే ఎంత దిగుబడి వస్తది అనేది ఆ భూమిని సాగు చేసే రైతుకే తెలుస్తదని, ప్రభుత్వం చెప్పిన పంట సాగు చేస్తే వచ్చే నష్టం ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు జగదేవపూర్ మండల అధ్యక్షులు నవేందర్ రెడ్డి, బాలయ్య, సురేష్, అత్తు తదితరులు ఉన్నారు.