రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్టు

by  |
రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్టు
X

న్యూఢిల్లీ: ఫేక్ టీఆర్‌పీ కేసులో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాంచందానిని ముంబయి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబయి కోర్టు వికాస్‌ను ఈ నెల 15 వరకు పోలీసు రిమాండ్‌కు పంపించింది. ఈ కేసులో అరెస్టైన వారిలో వికాస్ 13వ వ్యక్తి. టీఆర్‌పీ స్కామ్ గురించి వికాస్‌కు తెలుసని, ఈ సంక్షోభంతో లబ్ది చెందేది వికాసేనని ముంబయి పోలీసులు తెలిపారు. వ్యూయర్‌షిప్ సంఖ్యను ఎక్కువగా చూపెట్టే స్కామ్ కేసులో రిపబ్లిక్ టీవీతోపాటు, ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా, న్యూస్ నేషన్, మహా మూవీస్‌, వావ్ మ్యూజిక్ చానెళ్లపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed