- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, రచయిత, దర్శకురాలు, సినీ నటి రేణు దేశాయ్ ఇటీవలే తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ నేపథ్యంలో రేణుతో కలిసి యాంకర్ సుమ చేసిన ‘ఈట్ టాక్’ ప్రోగ్రామ్ను ఆమె బర్త్డే కానుకగా ప్రసారం చేశారు. కాగా ఆ షోలో తన పిల్లలు ఆద్య, అకీరా గురించి మాట్లాడుతూ.. రేణు భావోద్వేగానికి గురైంది. తన పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న తను.. ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సముద్రంలో సాగర కన్యలా ఈతకొడుతున్న రేణు.. భయాలను వీడి, ధైర్యంగా ముందడుగు వేస్తేనే అసలైన మ్యాజిక్ను ఆస్వాదించవచ్చని తెలిపింది.
‘మనమంతా ఏదో తెలియని వాటి గురించి ఎక్కువగా భయపడుతుంటాం. చీకటి, నీళ్లు, సముద్రాలు, భవిష్యత్తు వీటన్నింటినీ చూసి జంకుతుంటాం. కానీ మనమీద మనం చిన్నపాటి నమ్మకముంచి ఒక్కసారి వాటన్నింటినీ దాటుకుని ముందుకెళ్తే, లైఫ్లోని మ్యాజిక్ అర్థమవుతుంది’ అని రేణుదేశాయ్ ఇన్స్టా వేదికగా తన అభిమానులకు సూచించింది. రేణు కెరీర్ విషయానికి వస్తే, రైతుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది.