గులాబీ రంగు తొలగించండి : పువ్వాడ

by  |
గులాబీ రంగు తొలగించండి :  పువ్వాడ
X

దిశ ప్రతినిధి, ఖమ్మం:విమెన్ బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. మహిళలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఆర్టీసీ విమెన్‌ బయో టాయిలెట్‌ సర్వీసులకు గులాబీ తొలగించాలని చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను బుధవారం అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ బస్సులను మంత్రి అజయ్‌ కుమార్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్‌ ఆన్‌‌వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.

Next Story