చివరిసారిగా సుశాంత్‌తో అప్పుడే మాట్లాడా : డైరెక్టర్

by  |
చివరిసారిగా సుశాంత్‌తో అప్పుడే మాట్లాడా : డైరెక్టర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని జూన్ 14కు ఏడాది. ఈ క్రమంలో సుశాంత్‌తో తనకున్న బాండింగ్‌‌ను వివరించిన అతని ఫ్రెండ్, డైరెక్టర్ రూమీ జాఫ్రీ.. గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో సుశాంత్ తనతో సినిమా గురించి చర్చించేవాడని తెలిపాడు. ఈ మేరకు ఎమోషనల్‌గా మారిన రూమీ.. ‘సుశాంత్, నేను చాలా క్లోజ్. నా భార్య చేతి వంటను బాగా ఇష్టపడే తను.. అప్పుడప్పుడూ మా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. జీవితం ఎంత క్రూరమైందంటే.. ఏడాది క్రితం తనతో మాట్లాడేవాళ్లం, ఇప్పుడు తన గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనతో సరిగ్గా ఏడాది క్రితం జూన్ 12న మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడానని, అదే చివరి సంభాషణ అని తెలిపాడు.

2020 మేలో తనతో సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. అయితే మార్చిలో లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్ పట్ల సుశాంత్ కొంత ఆందోళనకు గురయ్యాడని చెప్పాడు. ఏప్రిల్ చివరినాటికి పరిస్థితులు నార్మల్ అవుతాయని తామంతా ఆశాజనకంగా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్ అవుతూ వచ్చిందని పేర్కొన్నాడు. ఇక చివరగా సుశాంత్ లక్షణాలను గుర్తుచేసుకున్న రూమీ.. తను మానవత్వం నిండి మనిషని, చిన్నపిల్లాడి మనస్తత్వమని అభిప్రాయపడ్డాడు. తమది ఒక ‘యాక్టర్, డైరెక్టర్’ను మించిన బంధమని వెల్లడించాడు.


Next Story

Most Viewed