భార్యకు రెండోపెళ్లి.. అజ్ఞాతంలోకి భర్త.. చివరికి

by  |
suicide attempt
X

దిశ, వెబ్‌డెస్క్: అతనో అటవీశాఖ అధికారి. ఓ యువతిని సంవత్సరం పాటు ప్రేమించి ఇంట్లో వారికి తెలియకుండా భార్యభర్తలయ్యారు. అయితే అక్కడే వచ్చింది చిక్కు. ఈ విషయం తెలియని సదరు యువతి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి మరోపెళ్లి చేశారు. భార్య రెండోపెళ్లి గురించి తెలిసిన అటవీశాఖ అధికారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటలన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ సెక్షన్ అధికారి క‌ృష్ణ గీత్ ఓ యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. అంతేకాకుండ ఇంట్లోవారికి తెలియకుండా పెళ్లి చేసున్నారు. వీరి పెళ్లి విషయం తెలియని యువతి తల్లిదండ్రులు ఆమెకు రెండో పెళ్లి చేశారు. ప్రియురాలికి రెండోపెళ్లి జరిగిన విషయం తెలిసిన కృష్ణ గీత్ ఏటోవెళ్లిపోయాడు.

చివరికి వీరి పెళ్లి విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆ యువతిని కృష్ణ గీత్ ఇంట్లో వదిలివెళ్లారు. ప్రియుడు కృష్ణ గీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో మోసం చేశాడని సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణ గీత్ ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింద. ఇది గమనించిన కుటుంబీకులు ఆమెను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిమితంగానే ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed