చనిపోయిన వారిని కూడా వదలని అక్రమార్కులు.. పోలీసులు ఎంట్రీతో సీన్ రివర్స్

by  |
rajesh
X

దిశ, కంది: గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు ఇంద్రకరణ్ ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 2015 వ సంవత్సరంలో కంది మండలం కాశీపూర్‌కు చెందిన షాపురం శంకరయ్య మృతి చెందాడు. దీనితో పంచాయతీ కార్యదర్శి పద్మ డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్‌లో షాపురం శంకరయ్య పేరును మార్చిన పండరిగౌడ్ అనే వ్యక్తి తన పేరును వ్రాసుకొని భూమిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పద్మ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఫోర్జరికి పాల్పడిన పండరి గౌడ్, మహేందర్ గౌడ్ లను మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Next Story

Most Viewed