విద్యుత్ అధికారులను కట్టేసిన నిందితులకు రిమాండ్

by  |
విద్యుత్ అధికారులను కట్టేసిన నిందితులకు రిమాండ్
X

దిశ, సంగారెడ్డి: అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో విద్యుత్ అధికారులను నిర్బంధిన సంఘటనలో ఆ గ్రామానికి చెందిన నర్సింలు, లక్ష్మయ్య, దుర్గయ్య, శంకర్, అంజయ్య ఐదుగురిపై కేసు నమోదు చేసి ఆదివారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు అల్లాదుర్గం ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, కట్టేసినందుకు లైన్ మెన్ నవాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story

Most Viewed