తుంగభద్ర పుష్కరాలకు నిధులు విడుదల

by  |
తుంగభద్ర పుష్కరాలకు నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ.2.50కోట్లు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ దగ్గర తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. పుష్కర పనులు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story