ఏపీలో కర్ఫ్యూలో సడలింపులు.. ఆ జిల్లాలో మాత్రం ఇలా

by  |
ఏపీలో కర్ఫ్యూలో సడలింపులు.. ఆ జిల్లాలో మాత్రం ఇలా
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. సాయంత్రం 6 గంటల వరకు అన్ని దుకాణాలు మూసివేయాలని సూచించింది. అయితే ఆ జిల్లాలో పాజిటివీ రేటు 5 శాతంలోపు వచ్చే వరకు ఇవే ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. మిగిలిన జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మినహాయింపులు ఇచ్చింది. అంతే కాకుండా థియేటర్లకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. అయితే సీటుకు.. సీటుకు మధ్య ఖాళీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతే కాకుండా జిమ్‌లు, కళ్యాణ మండపాలకు అనుమతినిచ్చింది. అయితే కొవిడ్ ప్రోటోకాల్స్ ను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నది.

Next Story

Most Viewed