ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురి నామినేషన్ల తిరస్కరణ

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్ సిటీ: శాసన మండలి స్థానిక సంస్థల కరీంనగర్ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురి నామినేషన్లు తిరస్కరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల పరిశీలకులు టి.విజయ్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు పరిశీలించారు. మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించగా శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్ రెడ్డిల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం [&hellip;]</p>

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురి నామినేషన్ల తిరస్కరణ
X

దిశ, కరీంనగర్ సిటీ: శాసన మండలి స్థానిక సంస్థల కరీంనగర్ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురి నామినేషన్లు తిరస్కరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల పరిశీలకులు టి.విజయ్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు పరిశీలించారు. మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించగా శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్ రెడ్డిల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు.

Next Story