పాస్‌పోర్టు, రిజిస్ట్రేషన్ సేవలు బంద్

by  |
పాస్‌పోర్టు, రిజిస్ట్రేషన్ సేవలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో పాస్ పోర్టు సేవా కేంద్రాల మూసివేసినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ అపాయింట్‌మెంట్లను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని కోరారు.

అటు లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 తర్వాత రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ప్రజలెవరూ రిజిస్ట్రేషన్ల కోసం రావొద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచే ఉంటాయని, కానీ 10 తర్వాత రిజిస్ట్రేషన్లు జరగవన్నారు.

Next Story

Most Viewed