57 ఏండ్ల పెన్షన్‌కు దరఖాస్తుల స్వీకరణ

by  |
pension
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్లు జారీ చేసే ప్రక్రియ మొదైలంది. ఆసరా పెన్షన్లలో భాగంగా 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు వయోపరిమితిని తగ్గించిన ప్రభుత్వం.. దానిని అనుసరించి అర్హులను ఎంపిక చేయనున్నారు. దీని కోసం ఈ నెలాఖరు వరకు మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్​ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. 57 ఏండ్ల పెన్షన్​కు అర్హత పొందే లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్​కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలిచ్చారు.

57 ఏండ్ల వయోపరిమితి మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఓ 75 ప్రకారం పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డు, ఆధార్​కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటోంది. అయితే ఈ దరఖాస్తుల కోసం ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed