ఈత వనం దగ్ధం చేసిన వారిపై చర్యలు

by  |
ఈత వనం దగ్ధం చేసిన వారిపై చర్యలు
X

దిశ, రంగారెడ్డి: షాద్‎నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం చేగూరు గ్రామ శివారులోని ఈత వనంలో సుమారు ఏడు వందలకు పైగా ఈత చెట్లు కాల్చి బూడిద చేశారు. ఈ సంఘటనపై ఆదివారం ఆర్డిఓ రాజేశ్వరి విచారణ జరిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాలతో.. ఆర్డిఓ సంఘటన స్థలానికి చేరుకొని దగ్ధం అయిన ఈత చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఆర్డీవోకు జరిగిన విషయాన్ని వివరించారు. ఈత వనంలో వందలాది చెట్లను కాల్చిన వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ రాజేశ్వరి చెప్పారు.

tag: Phoenix sylvestris, forest, Burned, RDO Rajeshwary, Inquiry, shadnagar


Next Story