- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు వెల్లడించింది. 2015, జులై నాటి బ్యాంకుల వర్గీకరణ, వాల్యూయేషన్, పెట్టుబడుల పోర్ట్ఫోలియో నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందున బ్యాంకుకు రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
సెక్యూరిటీల బదిలీల విషయంలో నిబంధనలు విరుద్ధంగా ఉన్నట్టు ఆర్బీఐ వివరించింది. ఈ జరిమానా రెగ్యులేటరీ అంగీకారంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన కారణంగా దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని ఐసీఐసీఐ బ్యాంకుకు నోటీసులను జారీ చేసింది.
Next Story