ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా

by  |
ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా సోకింది. ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పేర్కొన్నారు. తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు ఆయన ట్వీట్ లో తెలిపారు. కానీ తనకు కోవిడ్ లక్షణాలు కనిపించలేదని ఆయన చెప్పారు. ఇక తనను కలిసిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇక పై ఐసోలేషన్ నుంచే తన విధులను కొనసాగిస్తాననీ తెలిపారు. ఆర్‌బీఐ అధికారులతో ఎప్పటికప్పుడూ వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాననీ ఆయన అన్నారు.



Next Story

Most Viewed