- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, లోకేశ్వరం: ‘దిశ’ దిన పత్రికలో వచ్చిన వార్తకు ఆర్అండ్బీ అధికారులు స్పందించారు. ‘బీటీ రోడ్డుకు మొరంతో మరమ్మతులు’ అనే శీర్షికతో ‘దిశ’ దినపత్రికలో ఇటీవల వార్త ప్రచురితమైంది. గతవారం రోజుల క్రితం నర్సాపూర్(జి) మండలంలోని అర్లీ ఎక్స్ రోడ్డు నుండి లోకేశ్వరం వరకు గల ప్రధాన రహదారికి రూ.6 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే, ఈ పనుల్లో లోపాలు ఉన్నాయని ఎత్తిచూపుతూ ‘దిశ’ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. బీటీ రోడ్డుకు మొరంతో మరమ్మతులు చేపట్టడం వల్ల దీర్ఘకాలం ప్రయోజనం ఉండదని, డాంబర్తో మరమ్మతులు చేస్తే కనీసం హవార్గా గ్రామంలోని రోడ్డైనా కొన్ని రోజుల పాటు మన్నికగా ఉంటుందని వార్తలో పేర్కొన్నారు. దీంతో ఈ కథనాకికి రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి డాంబర్తో మరమ్మతులు చేపడుతున్నారు. దీనితో ‘దిశ’ దినపత్రికకు మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.
- Tags
- disha news
Next Story