స్పిన్నర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. 10మందికి పాజిటివ్

by  |
స్పిన్నర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. 10మందికి పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. అశ్విన్ ఇంట్లో పది మందికి కరోనా సోకినట్లు అతడి భార్య ప్రీతి తెలిపారు. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్లకు, నలుగురు పిల్లలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పిల్లల కారణంగా అందరికీ వైరస్‌ సోకింది. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడం జరిగింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి అని ప్రీతి అన్నారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబానికి అండగా ఉండటం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలోనే తప్పుకున్నాడు.

Next Story

Most Viewed