కోవిడ్ టీకా తీసుకున్న టీం ఇండియా హెడ్ కోచ్

by  |
కోవిడ్ టీకా తీసుకున్న టీం ఇండియా హెడ్ కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కోవిడ్-19 టీకాను తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో మంగళవారం ఆయన అహ్మదాబాద్‌లో టీకాను తీసుకొని ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘కోవిడ్ 19 టీకాను ఇప్పుడే తీసుకున్నాను. ఈ దేశాన్ని కోవిడ్‌పై పోరాటంలో శక్తివంతంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బందికి నా ధన్యవాదాలు.

అహ్మదాబాద్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను సమర్దవంతంగా నిర్వర్తిస్తున్న అపోలో ఆసుపత్రి సిబ్బందికి నా అభినందనలు’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు. ఈ రోజు మొదటి డోస్ తీసుకున్న శాస్త్రి మరో 15 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉన్నది. కాగా, టీమ్ ఇండియా చివరి టెస్టు ఫిబ్రవరి 4 నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలోనే నిర్వహించనున్నారు. దీంతో టీమ్ ఇండియా పూర్తి స్థాయిలో సాధన ప్రారంభించింది. ఈ మ్యాచ్ డ్రా చేసినా, గెలిచినా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.



Next Story

Most Viewed