పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ‘మనీ’హారం

by  |

దిశ, కరీంనగర్: అలుపెరగని శ్రమతో కరోనా వ్యాప్తి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రజలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘనంగా సన్మానించారు. డబ్బుల దండ, శాలువాలతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. కరోనా నివారణకు డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పాత్రికేయుల సేవలు మరువలేనియని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలతోనే పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్ పర్సన్ ఇప్పనపల్లి విజయ లక్ష్మి, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మహేశుని మల్లేశం, ఎండీ జహీర్‌లు పాల్గొన్నారు.

Tags: money denominater, mla ravi shankar, municipal workers, choppadhandi, karimnagar, corona, virus, lockdown,



Next Story

Most Viewed