- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పసిడి’ ఆశలు సజీవం.. ఒలింపిక్స్ ఫైనల్లోకి రెజ్లర్ రవికుమార్..
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. బుధవారం టోక్యో వేదికగా జరిగిన రెజ్లింగ్ మ్యాచ్లో రవికుమార్ సెమీ ఫైనల్లో విజయం సాధించాడు. పురుషుల 57కిలోల విభాగంలో రవికుమార్ దహియా కజకిస్తాన్ రెజ్లర్ను ఓడించి ఫైనల్కు చేరుకున్నాడు. దీంతో భారత్కు మరో పతకం ఖాయంగా కనిపిస్తోంది. ఒలింపిక్ ప్రారంభం నుంచి ఇంతవరకు భారత్కు బంగారు పతకం రాలేదు. సెమీస్ దాక వెళ్లిన చాలా మంది అథ్లెట్లు పోరాడి ఓడారు. ఎట్టకేలకు రెజ్లింగ్ పురుషుల విభాగంలో […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. బుధవారం టోక్యో వేదికగా జరిగిన రెజ్లింగ్ మ్యాచ్లో రవికుమార్ సెమీ ఫైనల్లో విజయం సాధించాడు. పురుషుల 57కిలోల విభాగంలో రవికుమార్ దహియా కజకిస్తాన్ రెజ్లర్ను ఓడించి ఫైనల్కు చేరుకున్నాడు. దీంతో భారత్కు మరో పతకం ఖాయంగా కనిపిస్తోంది. ఒలింపిక్ ప్రారంభం నుంచి ఇంతవరకు భారత్కు బంగారు పతకం రాలేదు. సెమీస్ దాక వెళ్లిన చాలా మంది అథ్లెట్లు పోరాడి ఓడారు.
ఎట్టకేలకు రెజ్లింగ్ పురుషుల విభాగంలో రవికుమార్ దహియా ఫైనల్కు చేరుకోవడంతో బంగారు పతకంపై ఆశలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఒకవేళ రవికుమార్ ఫైనల్లో గెలిస్తే టోక్యో వేదికగా భారత పతాకం రెపరెపలాడనుంది. అయితే, ఇండియా ఇప్పటివరకు ఒక సిల్వర్(మహిళా రెజ్లింగ్), రెండు కాంస్య (మహిళల బ్యాడ్మింటన్, బాక్సింగ్) పతకాలను మాత్రమే సాధించింది.
Next Story






