- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కల్లూరు (తల్లాడ ): ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని డాంబర్ మిల్లు దగ్గర వైరా మండలంలోని తాటిపూడి గ్రామం నుంచి రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడపడంతో రేషన్ బియ్యం రోడ్డు పోలయ్యాయి. వైరాలో మద్యం సేవించి తల్లాడ వచ్చిన తర్వాత మరలా మద్యం సేవించి.. హోటల్ లో భోజనం చేసి రంగం బంజర వెళ్తుండగా డాంబర్ ప్లాంట్ వద్ద వాహనాన్ని అధిగమించబోయి అటు ఇటు నిర్లక్ష్యంగా నడపడంతో బియ్యం బస్తాలు రోడ్డు పాలయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందిపడ్డారు. కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎస్సై ఎం. సురేష్ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి డ్రైవర్ ను ప్రశ్నించాడు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- kallur
Next Story