మద్యం మత్తులో డ్రైవర్.. రోడ్డు పాలైన రేషన్ బియ్యం

by  |
ration-1
X

దిశ, కల్లూరు (తల్లాడ ): ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని డాంబర్ మిల్లు దగ్గర వైరా మండలంలోని తాటిపూడి గ్రామం నుంచి రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడపడంతో రేషన్ బియ్యం రోడ్డు పోలయ్యాయి. వైరాలో మద్యం సేవించి తల్లాడ వచ్చిన తర్వాత మరలా మద్యం సేవించి.. హోటల్ లో భోజనం చేసి రంగం బంజర వెళ్తుండగా డాంబర్ ప్లాంట్ వద్ద వాహనాన్ని అధిగమించబోయి అటు ఇటు నిర్లక్ష్యంగా నడపడంతో బియ్యం బస్తాలు రోడ్డు పాలయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందిపడ్డారు. కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎస్సై ఎం. సురేష్ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి డ్రైవర్ ను ప్రశ్నించాడు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సై తెలిపారు.

Ration-2



Next Story

Most Viewed