- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్ : రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్. దేశంలో అత్యంత సంపన్నులలో ఒకరైన రతన్ టాటాకు వ్యాపార రంగంలో మిత్రులే తప్ప శత్రువులు లేరంటే ఆయన హుందాతనం, వ్యక్తిత్వం ఏంటన్నది చెప్పవచ్చు. ఇటీవల టాటా కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనారోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా ఆయన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి టాటా కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ అనారోగ్య కారణంగా జాబ్ కు రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఉద్యోగి యోగేశ్ దేశాయ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా మానవత్వం చాటుకున్నారు. ముంబై నుంచి పూణేలోని ఫ్రెండ్స్ సొసైటీలో నివాసం ఉంటున్న ఉద్యోగి ఇంటికి స్వయంగా వెళ్లారు. యోగేష్ నీ ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కాగా గతంలో జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో గాయపడ్డ టాటా కంపెనీకి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రతన్ టాటా అండగా నిలుస్తున్నారు.80 మంది ఉద్యోగుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకుంటున్నారు.