బాలీవుడ్‌ టీమ్‌తో జాయిన్ అయిన రష్మిక

by  |
బాలీవుడ్‌ టీమ్‌తో జాయిన్ అయిన రష్మిక
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ రష్మిక మందన బాలీవుడ్ మిషన్ స్టార్ట్ చేసింది. ‘మిషన్ మజ్ను’ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్న భామ.. తాజాగా మూవీ టీమ్‌తో జాయిన్ అయింది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి స్క్రిప్ట్ కాపీస్‌‌తో పోజిచ్చిన ఫొటోలు షేర్ చేసింది. స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ లక్నోలో జరుగుతుండగా.. ఫస్ట్ డే షూటింగ్‌ స్పెషల్‌‌గా ఉందని తెలిపింది.

శాంతను బాగ్చి దర్శకత్వంలో వస్తున్న సినిమాను రోనీ స్క్రూవాలా, గరిమా మెహతా, అమర్ నిర్మిస్తుండగా.. ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. పర్వీజ్ షేక్, అసీమ్ అరోరా, సుమిత్ కథ అందించగా.. డిసెంబర్ 23, 2020లో రిలీజైన ‘మిషన్ మజ్ను’ ఫస్ట్ లుక్ సినిమాపై ఇంట్రెస్ట్ బజ్ క్రియేట్ చేసింది. కాగా ఇందులో కోవర్ట్‌గా కనిపించబోతున్న సిద్ధార్థ్.. తన లుక్ టోటల్‌గా చేంజ్ చేశాడు. 45 రోజుల పాటు లక్నోలోని పలు ప్రాంతాల్లో జరిగే షూటింగ్‌లో హీరోహీరోయిన్లు పాల్గొంటుండగా.. ఈ ఫ్రెష్ పెయిర్‌ బిగ్ స్క్రీన్‌పై మెస్మరైజ్ చేస్తుందంటున్నారు మేకర్స్.



Next Story

Most Viewed