- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : మహిళలు, చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లైంగిక దాడులు పెరగడమే కాకుండా కొందరు కామాంధుల వికృత చేష్టలకు అమాయకపు యువతులు, మహిళలు బలవుతున్నారు. అయితే, ఈ లైంగిక దాడులు కూడా బాధితులకు బాగా తెలిసిన, సహచర వ్యక్తులు, కుటుంబంలోని వారి నుంచే జరగుతుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. తాజాగా ఓ 20 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరెనాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, యువతిపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడు.. తన సహచరులు ఇద్దరి కోరిక కూడా తీర్చాలని లేనియెడల రేప్ చేసిన సమయంలో చిత్రీకరించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో వాట్సాప్ గ్రూపుల్లో అత్యాచార బాధితురాలి వీడియోలు, స్ర్కీన్ షాట్స్ను షేర్ చేశాడు. అవి కాస్త వైరల్ అవడంతో బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి బావ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.