ప్రార్థనామందిరంలో యువతిపై అత్యాచారం

by  |
Rape attempt
X

దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే.. బోయిన్‌పల్లికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి, ఓ యువతికి మాయమాటలు చెప్పి ప్రార్థనా మందిరంలోకి తీసుకెళ్లాడు. అనంతరం యువతిని నిర్బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటికే యువతి కనిపించడం లేదని తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో యువతిని అతని వద్ద నుంచి తప్పించుకొని వచ్చి, తల్లిదండ్రులుకు విషయం చెప్పింది. దీంతో పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసుకొని, యువకుడి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు, ప్రార్థనా మందిరం(మజీద్)లో ఈ దారుణం జరుగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story