ప్రేమ పేరుతో వెంట పడి.. మైనర్ బాలికపై అత్యాచారం

by  |
ప్రేమ పేరుతో వెంట పడి.. మైనర్ బాలికపై అత్యాచారం
X

దిశ, నందిపేట్: నందిపేట్ మండలంలోని ఒక గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, నందిపేట్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు గత కొంత కాలంగా అమ్మాయిని ప్రేమ పేరుతో వెంట పడి లోబర్చుకున్నాడు. నందిపేట్ చర్చికి వెళ్లి వచ్చే క్రమంలో మైనర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 16న బాలికకు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది. బాలికను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నందిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed