దారుణం: ఉయ్యాలలోని 7 నెలల పాపను ఎత్తుకెళ్ళి అఘాయిత్యం..

by  |
crime news
X

దిశ, వెబ్‌డెస్క్: అభం శుభం తెలియని పసిగుడ్డు.. పాలు తాగి నిద్రపోవడం తప్ప ప్రపంచాన్ని చూడని చిన్నారి.. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న యువరాణి.. అలాంటి చిన్నారి కామాంధుల చేతికి చిక్కింది. ఊయలలో హాయిగా నిద్రపోతున్న ఆ చిన్నారిని చిదిమేశారు కామాంధులు. పసికందని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టారు. కామవాంఛతో కళ్లుమూసుకుపోయి విచక్షణ మరిచి రాక్షసుల్లా ప్రవర్తించారు. రాత్రివేళ ఊయలలో హాయిగా నిద్రపోతున్న ఏడునెలల పసిపాపను ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన గుంటూరులో సంచలనం సృష్టిస్తోంది.

వివరాలలోకి వెళితే.. మాచర్ల మండలంలో ఒక జంటకు ఏడునెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. పసిపాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తన ఇంటి ఆవరణలో ఉన్న ఉయ్యాల్లో నిద్రపుచ్చింది. అనంతరం ఆమె కూడా నిద్రపోయింది. మంగళవారం ఉదయం లేచేసరికి ఉయ్యాలలో పాప లేకపోయేసరికి ఆందోళన చెందిన తల్లి, కుటుంబసభ్యులతో కలిసి పాప కోసం చుట్టుపక్కల గాలించారు. వారి ఇంటికి కొద్ది దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో పడి ఉందని, స్థానికులు చెప్పడంతో అక్కడకు వెళ్లి చూస్తే తన బిడ్డేనని తల్లి గుర్తించింది. చిన్నారి పెదవులు, మర్మాయవాలపై గాయాలుండంటతో అత్యాచారం జరిగిందని అనుమానిస్తున్నారు. వెంటనే పాపను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఒక్కడా..? లేక గ్యాంగ్ ఉన్నారా..? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed