క్రైమ్ థ్రిల్లర్‌గా ‘రేప్ డి’ సిరీస్

by  |
క్రైమ్ థ్రిల్లర్‌గా ‘రేప్ డి’ సిరీస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పుణ్యమాని సిరీస్‌లకు మరింత ఆదరణ పెరిగింది. దీంతో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు కూడా సిరీస్‌ల వైపే మొగ్గుచూపుతున్నారు. బోల్డ్ కంటెంటె‌తో సూపర్ హిట్ సిరీస్‌లను అందిస్తున్నారు. ఈ క్రమంలో టాలెంట్ కేఫ్ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రేప్ డి’. అర్జున్ మహి, విన్ను మద్దిపాటి, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సిరీస్.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 22 వరకు ఫస్ట్ షెడ్యూల్ ఉండగా.. అక్టోబర్ మూడో వారంలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీదేవి. మొత్తం 15 ఎపిసోడ్స్‌గా వస్తున్న ‘రేప్ డి’ వెబ్ సిరీస్‌కు రవి శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్వంత్ తోట నిర్మిస్తున్నారు. వికాస్ కురిమిళ్ల సంగీతం అందిస్తున్న ఈ సిరీస్‌కు ప్రకాశ్ వేద కథ, మాటలు అందించగా.. మహేశ్ కాస ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Read Also…

అనుష్కపై లేడీ జర్నలిస్ట్ కామెంట్..


Next Story

Most Viewed