- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ గొర్రెల కాపరి తోటి మహిళా పశువుల కాపరిపై దారుణానికి ఒడిగట్టాడు. ఉదయం పశువులను మేపేందుకు వెళ్లిన ఒంటరి మహిళపై అత్యచారయత్నం చేశాడు. ఈ ఘటన అనంతరపురం జిల్లా పామిడి మండలం పాడియత్ తండాలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. స్థానిక తండాకు చెందిన బాబునాయక్ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే తండాకు ఓ మహిళ పశువులను మేపేందుకు స్థానికంగా గల ప్రదేశానికి ఒంటరిగా వెళ్లింది. అది గమనించిన బాబు నాయక్ ఆమెను బలవంతం చేయబోయాడు.
ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో తోటి కాపరులు వెంటనే అక్కడకు చేరుకునేలోపే బాబునాయక్ పారిపోయాడు. అతన్ని బాగోతాన్ని పశువుల కాపరి ఒకరు మొబైల్లో చిత్రీకరించారు. సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.