- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాణి ముఖర్జీ.. ‘హిచ్కి, మర్దాని, మర్దాని2, నో వన్ కిల్ల్డ్ జెస్సిక’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ రోజు(ఆదివారం) తన బర్త్డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తుండగా.. జీ స్టూడియోస్ స్పెషల్ గిఫ్ట్తో సర్ప్రైజ్ ఇచ్చింది. ఎమ్మె ఎంటర్టైన్మెంట్తో కలిసి ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసింది.
ఇందులో రాణిముఖర్జీ లీడ్ రోల్ ప్లే చేయనుండగా, యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఓ తల్లి తన దేశానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ అనౌన్స్మెంట్పై స్పందించిన రాణి.. తన 25 ఏళ్ల సినీ కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సినిమా కాబోతుందని, తన కెరీర్ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ అయిందని తెలిపింది. ఎమ్మె ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో తనకు ఈ ఆఫర్ దక్కడం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ చిత్రం ద్వారా అషిమ చిబ్బర్ బాలీవుడ్కు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.