ఫైనల్‌గా దుబాయ్‌లో ‘రంగ్ దే’

by  |
ఫైనల్‌గా దుబాయ్‌లో ‘రంగ్ దే’
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నితిన్, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రాబోతున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్‌లో ఉన్న మేకర్స్.. త్వరగా ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ దుబాయ్ పయనమైంది. కీర్తి, నితిన్‌పై కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటికే ‘రంగ్ దే’ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. ‘తొలిప్రేమ’ సినిమా తర్వాత డైరెక్టర్‌కు మళ్లీ అంత మంచి హిట్ పడుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయితే నితిన్ ‘అందాధున్’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండగా.. కీర్తి ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణకు హాజరుకానుంది. జనవరి ఫస్ట్ వీక్‌లో అమెరికాలో షూటింగ్ స్టార్ట్ కానుండగా.. రెండు నెలల పాటు కొనసాగనుంది.

Next Story

Most Viewed