సైబరాబాద్ సీపీ సజ్జనార్ లాగా ఎన్ కౌంటర్ చేయాలి

by  |
Ramya
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ… నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో దిశ అత్యాచారం కేసులో నిందితులను సీపీ సజ్జనార్ ఎన్ కౌంటర్ చేసినట్లు చేయాలని వేడుకుంటున్నారు. నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసేంతవరకు మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తీసుకెళ్లబోము అంటూ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed