- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లాలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్లో ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ… నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో దిశ అత్యాచారం కేసులో నిందితులను సీపీ సజ్జనార్ ఎన్ కౌంటర్ చేసినట్లు చేయాలని వేడుకుంటున్నారు. నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసేంతవరకు మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తీసుకెళ్లబోము అంటూ స్పష్టం చేశారు.
Next Story