- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రమ్యకృష్ణ… నీలాంబరిగా తన అభినయంతో రజినీకాంత్కే సవాల్ విసిరిన నటి… బాహుబలి తల్లి శివగామిగాను అంతే పవర్ ఫుల్నెస్ చూపించింది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆమె చేసే పోరాటం, డైలాగ్స్.. ఎట్ ఏ టైమ్ బిడ్డల పట్ల చూపించే ప్రేమ.. వావ్ అనిపించేలా ఉంటాయ్. ఆ నటనకు ఫిదా అయ్యే..కేజీఎఫ్-2 టీమ్ రమ్యకృష్ణను కీలక పాత్రకు ఎంచుకున్నారట. సినిమాలో మహిళా ప్రధానమంత్రి పాత్రలో పవర్ఫుల్ రోల్కు సంప్రదించారట. కానీ రమ్య.. బాహుబలి ఎఫెక్టో ఏమో, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఈ ఛాన్స్ కాస్త సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ను వరించింది.
పాన్ ఇండియా మూవీగా, క్రేజీ ప్రాజెక్ట్గా వస్తున్న సినిమాలో అవకాశం కోసం ఎంతో మంది క్యూలో ఉండగా.. ఇంత మంచి కీలకపాత్రను కాదనుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు బాధపడుతున్నారట. కాగా జూలై 2020లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు.