డీఎస్పీ కొలువును వదులుకుని…

by  |
డీఎస్పీ కొలువును వదులుకుని…
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీహార్‌లోని పాట్నా యూనివర్శిటీలో న్యాయశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రాం విలాస్ పాశ్వాన్.. తర్వాత బీహార్ రాష్ట్ర సివిల్ సర్వీసు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ సమాజంలో దళితుల పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలన్న పట్టుదల ఆయన్ను రాజకీయ నేతగా తీర్చిదిద్దింది. అదే సంవత్సరంలో సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ పార్టీకి బీహార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. నాలుగేళ్ళ తర్వాత ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో లోక్‌దళ్ పార్టీలో విలీనమైంది. కొత్త పార్టీకి కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.



Next Story

Most Viewed